ప్రాంతీయం

ఆర్టీఐ ఆక్టివిస్ట్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా మహమ్మద్ అన్వర్ అలీ నియామకం

143 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం మహమ్మద్ అన్వర్ అలీ నియామకం చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జి ముత్తు ఉత్తర్వులు జారీ చేశారు గంభీరావుపేట మండల కేంద్రం లో ని కోలమద్ది గ్రామానికి చెందిన మహమ్మద్ అన్వర్ అలీ ని నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేశారుతెలుగు రాష్ట్రాల అధ్యక్షులు జి.ముత్తు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజలందరూ కూడా సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కావలసిన సమాచారాన్ని అధికారుల నుండి ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుంటూ దానిలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరికైనా సమాచార హక్కు చట్టం సందేహాలను లేక ఫిర్యాదులను ఇవ్వాలి అనుకుంటే హెచ్ టి టి పి ఎస్ //.ఆర్ టి ఐ ఎస్ ఎస్ ఓ సి ఐ ఎ టి ఐ ఓ ఎన్. కామ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *