గజ్వేల్ లో పిడిచెడ్ రోడ్ లో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన మన ఉరి చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాల మార్గం అన్వేషించాలని మన ఊరి చేపల పులుసు కర్రీ పాయింట్ యజమాని తిరుపతికి శుభాకాంక్షలు, తెలిపి గజ్వేల్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ అనేక వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతూ ఉన్నారని అందులో భాగంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, భోజన ప్రియులకు అందుబాటుగా ఏర్పాటు చేసిన మన ఉరి చేపల పులుసు సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు నాణ్యమైన వస్తువులతో ఆహార పదార్థాలు విక్రయించాలని వినియోగదారుల మన్నన పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీవుద్దీన్, కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, డైరెక్టర్లు నిమ్మ రమేష్,ప్రవీణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు




