రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ విలేకరుల ప్రకటనలో తెలిపారు కుటుంబ సభ్యులు పోలీసుల వివరాల ప్రకారం గురువారం రోజు, ఎలగందుల లక్ష్మి, భర్త నర్సయ్య ,క గ్రామం ఎల్లారెడ్డిపేట, అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు, ఫిర్యాదికి ముగ్గురు కూతుళ్లు సంతానం కలదు అని వారిలో రెండవ కుమార్తె అయిన ఎలగందుల మమత, వయసు 29 సంవత్సరాలు ,అను ఆమెను 2014 సంవత్సరంలో దుబ్బాక మండలానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం చేసినామని వారి మధ్య విభేదాలు రావడం వల్ల విడాకులు కూడా తీసుకున్నారు అని అప్పటినుండి తన కూతురు ఇంటి వద్దనే ఉంటుందని విడాకుల విషయం గురించి చెప్పుకుంటూ తరచూ బాధపడుతూ ఉండేదని అలాగే మళ్లీ పెళ్లి చేయడానికి వేరే సంబంధాలు చూడగా అవి కూడా నచ్చలేదు, అని దీనితో తాను నా జీవితం వృధా అయ్యింది అని నేను బ్రతకడం వృధా అంటూ చెప్పుకుంటూ బాధపడుతూ ఉండేదని, ఇటి క్రమంలో తేదీ:- 25.01.2023 రోజున అందాల రాత్రి 7:30 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో తన కూతురు చున్నితో ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరివేసుకొని వేలాడుతూ ఉండగా వెంటనే అది చూసిన కుటుంబ సభ్యులు హాస్పటల్ తీసుకొని వెళ్ళగా డాక్టర్ చూసి చనిపోయిందని తెలిపినారని ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐ వి.శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు




