గజ్వేల్: తెలుగు న్యూస్24/7
గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మూడు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కల్వకుంట్ల తారకరామరావు పిలుపు మేరకు టిఆర్ఎస్ నాయకులు మొదటి రోజు స్థానిక ప్రభుత్వ దవాఖాన లో రోగులకు పండ్లు బ్రైడ్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ది చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, వైస్ చైర్మన్ జఖియుద్ధిన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగ మల్లేశం, కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





