మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మేకల కనకయ్య
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నీల రాములు అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ ఆదివారం నాడు మృతుడు నీల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యంతో పాటు 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాములపర్తి కరుణాకర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్,నర్సింలు, కొట్టాల మహేష్ తదితరులు పాల్గొన్నారు




