ముస్తాబాద్ జనవరి 14, మండలంలోనిత శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామిల కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఎంతో వైభవ పేతంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ముస్తాబాద్ మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లలిత శాస్త్ర పారాయణం చేశారు. నెల రోజులపాటు నిర్వహించిన భజన కార్యక్రమం శనివారంతో గోదాదేవి కళ్యాణం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పుష్కరించుకొని నెలరోజుల పాటు ముస్తాబాద్ మండలంలోని అన్ని వాడలకు చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో పాలీల వారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణం కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి కనుల పండుగకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
119 Views జగదేవపూర్: మండల కేంద్రం లో గల మల్లికార్జున స్వామి దేవాలయం లో ఆదివారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి. ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్.సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్.ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి. […]
90 Views(తిమ్మాపూర్ జూలై 14) తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులు మధ్య పొత్తరాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు చేరుకుని మొక్కులు సమర్పించుకొని, వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు.. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు రెడ్డి అంజి రెడ్డి, సంఘ ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు చింతల […]