హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిచె నిర్వహించబడిన ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం మెదక్ జిల్లా వర్సెస్ ఆర్ దయానంద్ టీం లు తలపడ్డాయి. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ హిషాంత్ S/O బాకీ స్వామి సత్తాచాటాడు. ఆటలో మొదటి రోజే 125 పరుగులు 146 బంతుల్లో చేసి అజేయంగా నిలిచాడు. అందులో 23 ఫోర్లు,1 సిక్స్ కొట్టాడు. హిషాంత్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ఇలాగే ఆటను కొనసాగించి గజ్వేల్ పేరుని నిలబెట్టాలని ఇంకా పై స్థాయికి ఎదగాలని కోచ్ రాజేందర్ రెడ్డి ఉమ్మడి క్రికెట్ మెదక్ జిల్లా సెక్రటరీ ఆకాంక్షించారు.




