ఆధ్యాత్మికం ప్రాంతీయం

తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

139 Views

రాయపోల్ మండల కేంద్రంలోని రాయపోల్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ముందస్తుగా గణిత సంబరాలలో భాగంగా రాయపోల్ మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని చూసి భయపడకుండా సాధన చేస్తే సులభతరమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి గణిత శ్రీరాములు, సలహాదారులు టి.రాములు, మండలంలోని వివిధ గణిత ఉపాధ్యాయులు రాజయ్య, గోవర్ధన్, తులసిదాస్, నరేందర్, లక్ష్మయ్య, సరిత, రజిత, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7