సిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ఆగస్టు 16, తెలుగు న్యూస్ 24/7
మార్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి. ఆదివారం అనగా 16-08-2026 తేదీన మార్కుక్ పోలీస్ స్టేషన్కు బొమ్మ పోచయ్య, తండ్రి శ్రీశైలం, వయస్సు 20 సంవత్సరాలు, కులం: కుర్మ, వృత్తి: వ్యవసాయం, దరఖాస్తు అందజేశారు.దరఖాస్తులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఫిర్యాదిదారు తండ్రి బొమ్మ పోచయ్య, వయస్సు 42 సంవత్సరాలు, కులం: కుర్మ, వృత్తి: వ్యవసాయం. గత రెండు సంవత్సరాల కాలంలో తన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేయడంతో సుమారు రూ.6 లక్షల అప్పు అయినట్లు, ఆ అప్పును ఎలా తీర్చాలో అనే ఆందోళనతో ఉండేవాడని తెలిపారు.అదేవిధంగా, కొద్ది రోజులుగా అతని భార్య లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండటంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించగా వైద్య ఖర్చులు పెరిగి అప్పులు మరింత పెరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో 15-08-2026 తేదీన ఉదయం సుమారు 11:00 గంటలకు గుర్తు తెలియని పురుగుమందు సేవించాడు.అనంతరం కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ప్రజ్ఞాపూర్లోని అతిథి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం లోటస్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు 16-08-2026 ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం( ఆర్ వి ఎం ) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై మార్కుక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సంఘటనకు గల కారణాలు మరియు ఇతర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టడం జరుగుతోంది.





