42 Views
ముస్తాబాద్ ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ఐదో వార్డ్ మార్కండేయ టెంపుల్ సమీపంలోని మినీ వాటర్ ట్యాంక్ నిరుపయోగంలోకి చేరుకుంది. ఐదో వార్డ్ ప్రజల నిత్యావసరాలకు ఆ ట్యాంక్ ఎంతో అవసరం. కానీ ట్యాంక్ చుట్టూ పిచ్చిగడ్డి మోకాళ్ళ మంటి పెరిగి పాములు తేళ్లు దోమల బెడదతో ప్రజలు ట్యాంక్ వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు
. ఇదివరకే ఉన్న మినీ ట్యాంక్ ను కూడా పరిశుభ్రత పాటించని పాలకుల నిర్లక్ష్యం సిగ్గుచేటని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి పిచ్చి గడ్డిని తొలగించి ఫాగింగ్ ద్వారా పొగ మందు స్ప్రేలు ఫినాయిల్ స్ప్రేలు బ్లీచింగ్ పౌడర్ చల్లి ఐదోవార్డ్ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
No Slide Found In Slider.
Poll not found