321 Views
ముస్తాబాద్, నవంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ

కు మద్దతుగా బూత్ అధ్యక్షులు ఊరడి రాజు ఆధ్వర్యంలో కమలంపువ్వు గుర్తును గడపగడపకు తీసుకెళుతున్న బిజెపి నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనేక పథకాలను తెలంగాణ రాష్ట్రానికి ప్రవేశపెట్టినవి విస్తారంగారోడ్లు, స్మశానవాటిక, డంపింగ్ యార్డులు, రోడ్లకు ఇరుపక్కల మొక్కలు, డబుల్ బెడ్ రూములు, రైతుల ఖాతాలో కిసాన్ డబ్బులు, రూపాయికి లోబియ్యం, గురించి వివరిస్తూ నరేంద్ర మోడీ తరపున సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా రాణి రుద్రమను అత్యధిక మెజారిటీతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చర్లపెళ్లి రజిత- సుధాకర్ రెడ్డి, సిరిసిల్ల కార్యాలయ సహాయక కార్యదర్శి బాధనరేష్, బాలేశ్వర్ రెడ్డి, అరుణ్ కుమార్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found