19 Views
ముస్తాబాద్, ఆగస్టు12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. పొలాల్లో పంటలను కూరగాయల చేలను కోతులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఇతర సామాన్లు పాడు చేస్తుండడంతో ప్రజలు భయంతో వనికి పోతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలు భయం గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళవలసి వస్తుందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సద్ది మధు

రెడ్డి మాట్లాడుతూ కోతులను వెంటనే అడవుల్లోకి తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
No Slide Found In Slider.
Poll not found