కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్
సిద్దిపేట్ బెజ్జంకి, ఆగస్టు 11, తెలుగు న్యూస్ 24/7
అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి.చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం,కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్ వంటి ప్రత్యేక కేటగిరీలకు చెందిన అర్హులకు చేయూత పథకం కింద పింఛన్లు అందనున్నాయని తెలిపారు. అర్హత ఉన్న ఒక్కరూ అవకాశం కోల్పోవద్దు.. సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు” అని రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. అర్హులైన వారు అవసరమైన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఎవరెవరికి పింఛన్లు.వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు , కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు,పింఛన్ వివరాలు.దివ్యాంగులకు ₹4,016.. ఇతర ప్రధాన కేటగిరీలకు ₹2,016 చేయూత పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని, పూర్తి వివరాలు మరియు అవసరమైన పత్రాలను గ్రామ పంచాయితీ కార్యదర్శి, లేక ఎంపిడివో కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని ఆయన సూచించారు. అర్హత ఉన్నారా? ఆలస్యం చేయకండి.. మీ పింఛన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు..





