సిద్దిపేట జిల్లా, ములుగు, ఆగస్టు 8 తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ వద్ద హైదరాబాద్–సిద్దిపేట రాజీవ్ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్లో ఆగి ఉన్న శ్రీనివాస్ (కొడకండ్ల) కారును వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు బలంగా ఢీకొట్టింది. కారు అద్దాలు ధ్వంసమైనప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






