మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నష ముక్తి కార్యక్రమం.
మంచిర్యాల
మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ నందు నష ముక్తి కార్యక్రమం బ్రహ్మకుమారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ రోజున బ్రహ్మకుమారి ఇన్చార్జి మంచిర్యాల్ ట్రమ్మక్కయ్య, సింధు, వాణి, సుధాకర్, ప్రసాద్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఇన్చార్జి రమణ నేటి సమాజంలో వ్యసనాలకు బానిసలు కాకుండా అందరం తమ వంతుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అందుకు మా వంతుగా మంచిర్యాల జిల్లా కు కార్యక్రమాన్ని ప్రారంభించే అందరికీ ప్రతిరోజు కాలేజీలలో కళాశాలలో కమ్యూనిటీ హాల్లో తెలియజేయడం మరియు అందరినీ ప్రతిజ్ఞ చేయించడం, అందరికీ ఆరోగ్యాన్ని ప్రశాంతతను మానసిక ఆనందాన్ని అందించడమే ధ్యేయంగా మా వంతుగా మేము సేవాభావంతో ముందుకు సాగడం జరుగుతుంది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము.





