ప్రాంతీయం

విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

15 Views

*మంచిర్యాల జిల్లా*

విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

జూలై 30, 2026:
ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫిన్లాండ్ విదేశీ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఎంపికై విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారని తెలిపారు. జిల్లాలోని జన్నారం మండలం అక్కపెల్లిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన జాజల శ్రీనివాస్, కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దాముక కమలాకర్ ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారని, వారి పాఠశాలలలో వరుసగా 450, 600 మంది విద్యార్థుల నమోదు ఉండటంతో రాష్ట్రంలో అత్యధిక విద్యార్థుల నమోదు కలిగిన పాఠశాలలుగా గుర్తింపు పొందాయని తెలిపారు. ఫిన్లాండ్ పర్యటనలో విద్యార్థి కేంద్రిత బోధన, సృజనాత్మక అభ్యాస పద్ధతులు, తరగతి గది నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారని, అక్కడి ఉత్తమ విద్యా విధానాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మరింత మంది ఉపాధ్యాయులను విదేశీ ఎక్స్‌పోజర్ విజిట్‌లకు పంపడంతో పాటు ప్రభుత్వ వ్యయంతో విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *