31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ లో బెడ బుడగ జంగాల ఆధ్వర్యంలో జరుపుకున్న ఆషాఢ మాస బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై 31 వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి తో కలిసి జాతరను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అమ్మ వారికి ఆషాఢ మాస బోనాలు సమర్పించి జాతర ఘనంగా నిర్వచించుకోవడం వలన ఆ అమ్మ వారి కృపకటాక్షలు డివిజన్ ప్రజలందరి కి లభించాలని ఆయన కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు,డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను ఘనంగా నిర్వచించుకోవడం జరిగింది.





