
మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండలం మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తల్లి చీటీ రత్నాలమ్మ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు.శుక్రవారం 11 గంటలకు వారి స్వగ్రామమైన హరిదాస్ నగర్ లో చీటీ రత్నాలమ్మ అంత్యక్రియలు జరుపబడునని,చీటీ రామారావు,చీటీ లక్ష్మణరావు,కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా చీటీ రత్నాలమ్మ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్,నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





