
తై బజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్)
4,20,500(నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు) పలికిన వేలం
రాచర్ల గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉపసర్పంచ్, పొన్నాల మణెమ్మ, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి తైబజార్ బహిరంగ వేలం వేయడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.ఇట్టి బహిరంగ వేలంలో నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలకు అందె లింగయ్య (సామెల్) దక్కించుకున్నారని తెలిపారు. గతంలో కంటే తైబజార్ వేలం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం ఎక్కువగా సమకూరడంతో సర్పంచ్, పాలకవర్గం తో పాటు గ్రామస్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.





