
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్
-గొల్లపల్లి – బొప్పాపూర్ శివారు లోని మూడు గుళ్ళ వద్ద మొక్కులు చెల్లింపు
గొల్లపల్లి-బొప్పాపూర్ శివారులోని మూడు గుళ్ళ వద్ద జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఇరు గ్రామాల ప్రజలు, హనుమాన్ మాలదారులు,భక్తుల మధ్య సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.కళ్యాణ వేడుక అనంతరం కేటీఆర్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు కేటీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు.ఈ కళ్యాణ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు,ఆలయ కమిటీ,ఇరు గ్రామాల సర్పంచులు భక్తులు పాల్గొన్నారు.





