మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగీంచుకోవాలి..
-ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
సిద్దిపేట జిల్లా,బెజ్జంకి, మార్చి 21, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయ మార్కెట్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేతిలో మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాట్లాడుతూ. రైతులు మొక్క జొన్న పండించిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్నలు 2400,సన్ ఫ్లవర్ 7721ధరకీమీ యొక్క ధాన్యాన్ని అమ్ముకొని ,ప్రభుత్వ మద్దతు ధర పొందాలని, దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని మోసపోవద్దని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి,లక్ష్మినర్సింహ స్వామి ఆలయ చేర్మెన్ జెల్ల ప్రభాకర్,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బోయిని ప్రశాంత్ ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





