అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్ దేవరాజు
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో 9వ వార్డులో మురికి కాలువపై వంతెన నిర్మాణ పనుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ సుధగోని దేవరాజు హాజరై కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుకోలు గ్రామ అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి బోయిని జయరాజు ,సెక్రెటరీ బాబు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు..





