మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మరియు డివిజన్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మరియు డివిజన్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ల ఆఫీసర్లు అందరూ ప్రతి డివిజన్ మా ఇళ్లు అనుకొని పనిచేయాలని పలు సూచనలు ఆదేశించారు..
మున్సిపల్ వర్కర్స్ లకు సంబంధించిన వస్తువులను, దుస్తులను అందజేయాలని కమీషనర్ గారికి ఆదేశించారు.
ప్రతి డివిజన్లలో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు..
ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య -మహేష్, వివిధ శాఖల అధికారులు, డివిజన్ ఆఫీసర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.





