వ్యవసాయ శాఖ అధికారులతో ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష..
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఆయా గ్రామాల వారిగా సమీక్ష జరిపి ఫార్మసీ రిజిస్ట్రీ నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఫార్మసీ రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చెయ్యాలని డివిజన్ వారిగా ఏడిఏ లు క్లస్టర్ వారిగా ఏఓ, ఏఈఓ లను తరుచు ఒక ప్రణాళిక ప్రకారం మానిటర్ చేస్తూ పూర్తి చేయించాలని ఆదేశించారు.ఆయా రైతులతో గ్రామపంచాయతిలో సమావేశం నిర్వహించి స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి రైతులతో మాట్లాడి ఒక ప్రణాళిక ప్రకారం ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చెయ్యాలని తెలిపారు. సోమవారం నుండి పంట నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూప రాణి తదితరులు ఉన్నారు.





