16 Views
- సిద్దిపేట జిల్లా రాయపోల్లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలల కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్ ఐఏఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను ఆయన అభినందించారు. పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ మరియు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు 3డి ప్రింటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించుకోవాలని సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వర్లుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, ఏఎంవో రమేష్, ఏపీసీ బేతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found