సుతారి సంఘ భవనానికి నిధుల మంజూరుకీ వినతి
సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఫిబ్రవరి 22, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు సోము శంకరయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని మర్యాద పూర్వకంగా కలిసి గుగ్గిళ్ల గ్రామానికి సుతారి సంఘం భవన నిర్మాణం మంజూరు కోసం నిధులు మంజూరు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సానుకూలంగా స్పందించి తొందరలోనే సుతారి సంఘ భవన నిర్మాణనికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల రాజేష్, దుగ్యాని మోహన్, బోయిని మల్లయ్య,కొంకటి సురేష్, యూత్ కాంగ్రెస్ బెజ్జంకి మండల వైస్ ప్రెసిడెంట్ బోయిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





