సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గురువారం చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు బ్యాండ్ను బహుకరించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి భావాలు మరియు సాంస్కృతిక చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ బ్యాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాలకు బ్యాండ్ అందజేసిన చేయూత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు వివిధ వేడుకలు, జాతీయ పర్వదినాలు మరియు పోటీలలో పాల్గొనడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ సభ్యులు రమేష్, స్వామి, రమేష్తో పాటు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





