ప్రాంతీయం

చేయూత పౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు బ్యాండు అందజేత.

171 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గురువారం చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు బ్యాండ్‌ను బహుకరించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి భావాలు మరియు సాంస్కృతిక చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ బ్యాండ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాలకు బ్యాండ్ అందజేసిన చేయూత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు వివిధ వేడుకలు, జాతీయ పర్వదినాలు మరియు పోటీలలో పాల్గొనడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ సభ్యులు రమేష్, స్వామి, రమేష్‌తో పాటు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *