తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) జన్మదిన వేడుకలను మంగళవారం రోజు ముస్తాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణతల్లి కూడలిలో వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బిఆర్ఎస్ నాయకులు మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పాత్రను స్మరించుకుంటూ ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతని కొని యాడారు. రైతు, విద్యార్థి, మహిళ, నిరుద్యోగ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దూరదృష్టి గల నాయకుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
70 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య* *బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్.,* ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ స్కూల్ పేరుతో పాఠశాలలు ప్రారంభించినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్. పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి […]
209 Viewsపోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు :సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా 25 అక్టోబర్2023: శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని టౌన్ పోలీస్ , ఎన్జీవో ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఏర్పాటు చేసిన క్రొవ్వొత్తిని వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ […]
39 Viewsప్రజావాణితో సమస్యల పరిష్కారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 126 దరజాస్తుల రాక ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, […]