అక్టోబర్ 07 హైదరాబాద్:
ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న 27 మంది సీనియర్ అధ్యాపకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు లభించాయి.
ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ పదోన్నతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం, టీజీసీటీఏ అధ్యక్షులు డాక్టర్ సంగి రమేశ్, కార్యదర్శి డాక్టర్ బ్రిజేశ్, చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
