ప్రాంతీయం

హనుమాన్ దేవస్థానానికి ఎలక్ట్రానిక్ డ్రమ్ అందజేత

107 Views

హనుమాన్ దేవస్థానానికి ఎలక్ట్రానిక్ డ్రమ్ అందజేసిన

నచ్చరాజు రఘునాథ రావు కుమార్తె ఉషారాణి 

సిద్దిపేట జిల్లా,బెజ్జంకి ఫిబ్రవరి 14, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలోనీ హనుమాన్ దేవస్థానానికి మంగళహారతి ఇచ్చేటప్పుడు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డ్రామ్ నీ నచ్చరాజు రఘునాథరావు కుమార్తె సమయ్మంత్రి ఉషారాణి ఎలక్ట్రానిక్ డ్రం ని శనివారం హనుమాన్ దేవస్థాన భక్త మండలికి అందజేశారు.ఈ సందర్భంగా హనుమాన్ భక్త మండలి, గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ పాలకవర్గం మాట్లాడుతూ నచ్చరాజు రఘునాథ రావు కుమార్తె ఉషారాణి దాతగా నిలిచి ఎలక్ట్రానిక్ డ్రం ని హనుమాన్ దేవస్థానానికి తమ సొంత డబ్బులతో కొని ఇచ్చినందుకుగాను భజన మండలి,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ పురోహితులు గుండయ్య శర్మ హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉపసర్పంచ్ దుగ్యని లావణ్య, వార్డు కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్,గ్రామ ప్రజలు చెప్యాల సంతోష్,వొడ్నాల రాజేశం, జిల్లా అనంతం, సీత సంతోష్,సుంకర పల్లి లక్ష్మన్, మధు,హనుమాన్ భక్త బృందం తదితరులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *