జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత మంచిర్యాల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మరియు రాంనగర్ వాడలను సందర్శించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరియు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలపైన వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తల పైన అదేవిధంగా వాతావరణం లో మార్పుల వలన జ్వరాలు రావడం దగ్గు సర్ది చిన్నపిల్లలకు ర్యాష్ రావడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ నగర్ వాడలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అదేవిధంగా చిన్నపిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం వారికి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగినది ముఖ్యంగా కీటకజనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటి అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని దోమలు గుడ్లు పెట్టకుండా పెరగకుండా కుట్టకుండా చూసుకోవడం అదేవిధంగా మంచినీటిని తీసుకొనడం ఆహార పదార్థాలను వేడివి తీసుకొనడం ముఖ్యంగా జీవనశైలిలో మార్పుల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ సుమన్ డిటిహెచ్ ఎన్ ఆర్ ఎస్ పద్మ అంగన్వాడి కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు పద్మ అంజలి పాల్గొన్నారు.




