మున్సిపల్ బరిలో చేన్నబోయిన అనూష విద్యాసాగర్
ప్రచారంలో దూసుకుపోతున్న అనుషవిద్యాసాగర్
1వార్డు ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన…
హుస్నాబాద్, ఫిబ్రవరి 2, తెలుగు న్యూస్ 24/7
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల వాతావరణం రోజుకు వేడెక్కుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలలో తీవ్ర పోటీ నెలకొంది.ఈసారి హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని 1వార్డులో చేన్నబోయిన అనూష విద్యాసాగర్ పోటీ చేస్తున్నారు.మున్సిపల్ రాజకీయాల్లో అనూష విద్యాసాగర్ తనదైన శైలిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో వార్డు ప్రజల్లో అనూష విద్యాసాగర్ కు మంచి పేరు ఆదరణ ఉండటముతో గెలుపు ఖాయమని ప్రజలు తెలిపారు.చాలా సంవత్సరాల నుండి యూత్ కాంగ్రెస్ లో పట్టణ సమస్యలపై అనుభవం ఉండటం. సమస్యలపై అవగాహన ఉందని వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని నమ్మకం ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. అనూష విద్యాసాగర్ కిఅన్ని వర్గాల ప్రజలతో అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.వార్డులో తిరుగుతూ ప్రజల మద్దతు కల్పించాలని కోరుతున్నారు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు ప్రజల సహకారం కావాలని ప్రణాళిక వైపుగా సాగుతున్నారు.వారి పయనం విజయపతంలోకి రావాలని కౌన్సిలర్ గా విజయదుందుభి మోగించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ప్రధాన సమస్యలు రేషన్ షాప్ వార్డుకు దూరంగా ఉందని వార్డులో ఏర్పాటు చేస్తానని, మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు.అనూష విద్యాసాగర్ ను కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని వార్డు సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డ్ ప్రజలకు మంచి చేయాలని తపనతో ముందుకు నిస్వార్థంగా ప్రజలకు పాలన అందించుటకు ముందుకు వస్తున్నామని మేము వేయబోయే అడుగులకు దారి మీ ఓటు అనిమమ్మల్ని ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపించుకోగలరని వార్డు ప్రజలను కోరుతున్నారు.





