తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా.
నేడు మంచిర్యాల నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి గాను (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజెషన్)లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదగా మంచిర్యాల లలో ప్రారంభించటం జరిగింది.కార్యక్రమములో మంచిర్యాల ఏ ఎం సి చైర్మన్ పయ్యావుల పద్మ ముని గారు,ఆత్మ బి ఎఫ్ ఏ సి ఛైర్మన్ సింగటి మురళి, మంచిర్యాల జిల్ల వ్యవసాయ అధికారిని శ్రీమతి సురేఖ ,సహాయ వ్యవసాయ సంచాలకులు మంచిర్యాల డివిజన్ శ్రీ ఎం. కృష్ణ మరియు నియోజక వర్గ మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 6 పవర్ టిల్లర్లు, 6 రోటవేటర్లు, 52 పవర్ స్ప్రేయర్లు, 16 బ్రష్ కట్టర్లు మొత్తం 81 పరికరాలు 16.24లక్షల సబ్సిడీ పైన ఇవ్వడం జరిగింది.





