ప్రతాపరుద్ర సింగరాయ జాతరలో అపశ్రుతి
సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందినబొందిలి శివసాయి వయస్సు 15 సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు.సింగరాయజాతరలో స్నానంచేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నీటిలోపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులువెంటనే అంబులెన్స్లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు. మార్గమధ్య లోనే మృతి చెందినట్లువైద్యులు ధృవీకరించారు. కళ్లముందే కుమారుడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లి సోనీ, తండ్రి నర్సింగ్ కన్నీరుమున్నీరవుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





