సిద్దిపేట కోహెడ మండలం లోని శ్రీశ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర విచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7
కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయడు పేరు మీద ఈ సింగరాయుని జాతర జరుగుతుంది.ఈ ప్రాంత ప్రజలకి సింగరాయుని జాతర విశ్వాసం మోయ తుమ్మెద వాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు,సింగరాయుని జాతర కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశాం.ఈ ప్రాంతం అంత మంచి వర్షాలతో ఉండాలి,పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్న..అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు.. అందరిపై లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఉండాలి.తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరే విధంగా ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు.





