బొక్కలగుట్ట వద్ద డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం.
రామకృష్ణాపూర్ // మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బొక్కలగుట్ట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొంది.ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఆ గాయపడిన వాళ్లను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఆ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





