నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట్ జిల్లా, జనవరి 13,తెలుసు న్యూస్ 24/7
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బండి సత్తయ్య ప్రమాదవశాత్తు మోరిలో పడి మృతి చెందారు. ఆయన నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ విషాద విషయాన్ని బరిగేల సాయి వంగ రాజేశ్వర్ రెడ్డి,కి తెలియజేశారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.అదేవిధంగా అదే గ్రామానికి చెందిన పెరుమాండ్ల కవిత అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బరిగేల సాయి, మంద రిషిబాబు, వెంకటేష్, రామచంద్రం,కనకయ్య,తదితరులు పాల్గొన్నారు





