ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్12, (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఆదివారం ముస్తాబాద్ మండల చీకోడు, చిప్పలపల్లి ఇరు గ్రామాలకు చెందిన యువకులు 200 పైచిలుకు కేకే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్ని రకాలుగా లబ్ది పొందిందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజానికమంతా మీరు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోరని మార్పు మొదలైంది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. మీపాలనపై విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని కమిషన్లు దండుకోవడం తప్ప మరొకటి చేయలేదని అన్నారు. సీసీ రోడ్లనువేసి ఇంటికో నల్ల కనెక్షన్ అంటూ రోడ్లను పగలగొట్టుడే తప్ప నీళ్లు రాలేవన్నారు. నాడు ఇచ్చిన మాట తప్పిన వాగ్దానాలు దళితునికి మూడెకరాల భూమిలేదు, దళిత సీఎం
లేడు, దళితబంధు లేదు, ఇంటికో ఉద్యోగంలేదు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి పతనం ఖాయమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి లభిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, కొండం రాజిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి రమేష్, పురం బాపురెడ్డి, సుద్దాల దేవయ్య, మహేందర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




