పుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం
కార్యక్రమంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో ప్రథమ బహుమతి సాధించిన ఆర్. వెంకటలక్ష్మికి ₹3,000 నగదు, ద్వితీయ బహుమతి గెలుచుకున్న ఆర్. విమలకు ₹1,500 నగదు బహుమతులు అందజేశారు. అలాగే మూడవ, నాల్గవ, ఐదవ బహుమతులను కూడా విజేతలకు వంగ రాజేశ్వర్ రెడ్డి , సర్పంచ్ కుంచం లత వెంకట్ యాదవ్,ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్, చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు,మహిళలు,యువత పాల్గొన్నారు.





