మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులు
సిద్దిపేట జిల్లా జనవరి, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొలిచెలిమే స్వామి మాట్లాడుతూ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మున్సిపల్ లో వార్డుల పునర్విభజనలో భాగంగా మా ఆర్ అండ్ ఆర్ కాలనీ ఓటర్లు వివిధ వార్డుల్లో కలిపారని ఎవరు ఏ వార్డులో ఉన్నారో అయోమయంగా ఉన్నారని ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రత్యేకంగా ఓటర్ల జాబితా తయారుచేసి మాకు ప్రత్యేకంగా వార్డులు కేటాయించాలని ఇప్పుడు 6 వార్డులు కేటాయించడం సంతోషంగా ఉందని కానీ ఆ 6 వార్డులు మా గ్రామాల వారికి చెందే విధంగా చూడాలని అధికారులకు విన్నవించడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో బాలకిషన్, నర్సింలు, పురుషోత్తం రెడ్డి, జహంగీర్, శ్రీనివాస్, కనక గౌడ్, తిప్పారమ్ కనకయ్య,నాగరాజు,పరుశురాం,ఈ స్వామి, తదితరులు పాల్గొన్నారు





