యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచన బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా ప్రజలకు మరియు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ 31 డిసెంబర్ సందర్భంగా యువత మద్యం తాగి వాహనాలు నడపద్దని మద్యం తాగి నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీ తో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని మరియు పోలీస్ శాఖ కూడా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలియజేయడం జరిగింది. కావున యువత దయచేసి మద్యం తాగి వాహనాలు నడపద్దని మీరు మీ కుటుంబ సభ్యులు తో సంతోషంతో నూతన సంవత్సరం జరుపుకోవాలని తెలియజేశారు.





