ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలి
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 )
ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థలలో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 తరగతులలో ఖాళీల ప్రవేశాలకు, టీ జి స్వేరిస్ గౌలిదొడ్డి, అలుగునూరు సీ ఓ ఈ, లలో 9వ తరగతి ప్రవేశాలు, టీజీ ట్వరేస్ ఖమ్మం, పరిగి ఎస్ ఓ ఈ, లలో,8వ తరగతి ప్రవేశాలు, టీజీ స్వరేస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను కామన్ ప్రవేశ పరీక్షకు (ఇంగ్లీషు మీడియం) జిల్లా నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందు కోసం దరఖాస్తులను https://tgcet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలన్నారు.అలాగే దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల జనవరి 21 అని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదిన ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనుటకు కావలసినవి:1. కులం సర్టిఫికేట్ నెంబరు 2. ఆదాయం సర్టిఫికెట్ నెంబరు 3. ఆధార్ కార్డు నెంబర్ 4. బర్త్ సర్టిఫికేట్ 5. ఫొటోలు ,సర్టిఫికెట్ల సత్వర జారి కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.





