ప్రాంతీయం

లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ సమావేశం

71 Views

జనవరి, ఫిబ్రవరి నెలలలో జరిగే యు జి సి – ఎన్ ఈ టి – 2026

-జేఈఈ -2026లకు అర్హత పరీక్ష ఆన్లైన్ లో నిర్వహణకు మే నెలలో నీట్( ఎన్ ఈ ఈ టి )-2026 ఆఫ్

-లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ సమావేశం.

జిల్లా కలెక్టర్ కె. హైమావతి 

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 19,( తెలుగు న్యూస్ 24/7)

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలలో జరిగే యు జి సి – ఎన్ ఈ టి – 2026 మరియు జే ఈ ఈ -2026లకు అర్హత పరీక్ష ఆన్లైన్ లో నిర్వహణకు మే నెలలో నీట్( ఎన్ ఈ ఈ టి )-2026 ఆఫ్ లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో యు జి సి – ఎన్ ఈ టి – 2026 కోసం ఒక సెంటర్, జేఈఈ -2026 కోసం 2 సెంటర్ లలో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్ టి ఏ) మార్గదర్శకాల ప్రకారం సెంటర్ లను ఎంపిక చేసి ఆ సెంటర్ లో సీసీ కెమెరా, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, ఫర్నిచర్, టాయిలెట్స్, కంప్యూటర్లు, నెట్ సౌకర్యం ఇతరత్రా అన్ని సౌకర్యాలు చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ లను తనిఖీ తర్వాత ఆ నివేదికను( ఎన్ టి ఏ) కు పంపించాలని తెలిపారు.ఈ సమావేశం లో డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ రాజ్ కుమార్, కెవి ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్, నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్, పోలీస్, ఎన్ఐసి అధికారులు తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *