రామకోటి రామరాజకు ముక్కోటి ఏకాదశి ఆహ్వానం
గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాల కార్యక్రమం అమోఘం
దుబ్బాక బాలాజీ దేవాలయం ప్రతినిధి చింత నాగేందర్
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17, ( తెలుగు న్యూస్ 24/7 )
రామ నామమే ప్రాణమని నమ్మి గత 30 సంవత్సరాలనుండి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రతి భక్కునిచే రామనామాన్ని లిఖింపజెపిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు,కి బుధవారం నాడు దుబ్బాక బాలాజీ దేవాయ ప్రతినిధి చింత నాగేందరు ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఆహ్వానం పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యానానికి మా దుబ్బాక చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి ప్రతి సంవత్సరం గోటితో వడ్లను ఓలిపించి భద్రాచల కల్యానానికి అందించి మళ్ళీ మాకు తిరిగి ఉచితంగా ముత్యాల తలంబ్రాలు అందించడం అయన చేస్తున్న నిశ్వార్థ భక్తి అమోఘం అని వారి సేవలను కొనియాడారు.





