Posted onAuthorTelugu News 24/7Comments Off on ఘనంగా డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…
113 Views
ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు.
స్వతహాగా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అనేక డిగ్రీలతోపాటు గొప్ప చదువులు చదివి సమాజంలోజరుగుతున్న అసమానతలపై పోరాటం చేసిన గొప్పవ్యక్తి అణగారిన వర్గాలకే కాకుండా యావత్ భారతావనికి దిక్సూచి ఆ మహానీయుడు ఏ ఒక్కరికి కాకుండా ఈ జాతి మొత్తానికి నాయకుడు ఆ మహానీయుని కర్తవ్యనిష్ఠ, దేశభక్తి భావితరాలకు అందించాలని కోరారు. ఈకార్యక్రమం ఏబీవీపీ కార్యకర్తలు, పాఠశాల విద్యాబోధకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
131 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని MPUPS ఆరేపల్లి పాఠశాల నందు శుక్రవారం రోజున స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది .ఇందులో భాగంగా నికిత డిఈఓ గా వైష్ణవి ప్రధానోపాధ్యాయులుగా ఈశ్వర్, ఉపాధ్యాయులుగా ఆయేషా, జశ్వాంత్, ఇలియాజ్, సుభాన్, అక్షిత మరియు జశ్వాంత్ పాల్గొన్నారు. బాగా కష్టపడి కృషిచేసి చదువుకోవడం వల్లనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు మరియు ఆశయాలను సాధిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ […]
109 Viewsగంభీరావుపేట మండలం లో రెండు మూడు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు నర్మాల ఎగువ మానేరు మత్తడి నుండి నీరు ప్రమాదకరంగా దూకుతుండడంతో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి ఎవరిని అనుమతించడం లేదని,గంభీరావుపేట నుండి లింగన్నపేట నుండి పోయే వారందరికి దూర ప్రాంతాల నుండి, చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విందించడమైందని ఈ సందర్భంగా గంభీరావుపేట పోలీసులు […]
174 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 29 మన ఊరు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిడమానూరు మండలం నిడమానూరు గ్రామంనుండి చింతగుడెం వరకు రూ.4 కోట్ల 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రోడ్ పనులను శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండల పరిసర గ్రామంలో ప్రజల చిరకాల కోరిక నిడమనూరు నల్గొండ చింతగూడెం స్టేజీ మీదుగా రహదారి నిర్మాణం నేడు […]