కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చే 42 శాతం బీసీ రిజర్వేషన్లను బీసీ జేఏసీ వ్యతిరేకిస్తుంది
బీసీ జేఏసీ మంచిర్యాల్ జిల్లా కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి మనోహర్.
మంచిర్యాల జిల్లా.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే కాంగ్రెస్ పార్టీని బీసీ ప్రజలు నమ్మరని, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కో -ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్ అన్నారు, ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరపున పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ జేఏసీ, రాష్ట్ర కమిటీ పిలుపు.ఈ సందర్భంగా మందమర్రి పట్టణంలో మంచిర్యాల జిల్లా జేఏసీ నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణం లో అంబేద్కర్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ దీక్షలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పై చర్చకు పెట్టీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలని, లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వేలాదిమందితో పార్లమెంటును దిగ్బంధం చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈనెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నిలకు ఎన్నికలకు పోతున్నామని ప్రకటించడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిసెంబరు ఒకటవ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా
రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షoతో వెళ్లాలనీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలనీ ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి ఢిల్లీ వేదికగా పోరాడాలని రాష్ట్రానికి అయన సూచించారు, కేంద్రంపై పోరాడకుండా స్థానిక ఎన్నికలు వెళ్తే బీసీలకు కాంగ్రెస్ దోషిగా మిగులుతుందన్నారు,బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదన్నారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తారనీ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల వలె బీసీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దండెత్తరని హెచ్చరించారు.
ఢిల్లీ తో కాంగ్రెస్ పోరాడితే దేశంలోని బీసీల అండ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకుంటున్న బిజెపిని బీసీల దోషిగా చేసే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందన్నారు.
బీసీ ప్రధానిగా నరేంద్ర మోడీ గత
11 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ బీసీల డిమాండ్లను ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరమన్నారు, బిజెపికి బీసీల పై చిత్తశుద్ధి ఉంటే డిసెంబరు లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
బిజెపి గత ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు కూడా బిసిని చేయలేదని బీసీ కులగలను బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నందునే నిన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలు బిజెపికి డిపాజిట్ రాకుండా చేశారని, బీసీ వైఖరితో బిజెపి ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలే పునరావృత్తం అవుతాయని ఆయన హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లపై బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ జేఏసీ ఇప్పటికే గత సెప్టెంబర్ 18న రాష్ట్ర బంద్ నిర్వహించామని, నవంబర్ 6 పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన దీక్షలు చేపట్టామని, మొన్న 13న తెలంగాణలోని 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు అన్ని మండల కేంద్రాల్లో వేలాదిమంది రోడ్ల మీదకు వచ్చి ధర్మదీక్షలో చేశామని, రన్ ఫర్ సోషలిసిస్ పేరుతో ర్యాలీలు తీసామని, డిసెంబర్లో గల్లి నుండి ఢిల్లీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింప చేస్తామని ఆయన తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం పల్లె నుండి పట్నం దాకా బీసీలు పోరాడుతారని 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదనీ, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరాలు బీసీ ఉద్యమించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మందమర్రి నాయకులు పోలు శ్రీనివాస్,బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా మీడియా ఇంచార్జి కట్కోజుల రమణాచారి, మందమర్రి బీసీ సంఘం నాయకులు తడి గొప్పల రవి రాజా, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బేరా వేణుగోపాల్, ఎండి ఖలీల్ మడ్డి వేణుగోపాల్, యోగానంద రావు, కమలాకర్ పాల్గొన్నారు.





