బీజేపీ జిల్లా కార్యాలయంలో వెలుముల జగన్నాథ్ రావు కి సంస్మరణ సభ.
మంచిర్యాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల జగన్నాథ్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్నాథ్ రావు పార్టీ కి చేసిన సేవలను బీజేపీ శ్రేణులు స్మరించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పానుగంటి మధు, మొటపలుకుల తిరుపతి, వైద్య శ్రీధర్, మంత్రి రామన్న, కాశెట్టి నాగేశ్వర్ రావు, రాకేష్ రెన్వ మరియు తదితరులు పాల్గొన్నారు





