మరోసారి మానవత్వం చాటుకున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్.
మంచిర్యాల జిల్లా.
ఈరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నస్పూర్ సి సి కార్నల్ మేకల మండి యందు ఒక వ్యక్తి బైక్ పై వెళుతుంటే కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయి, అటుగా వెళుతున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారు ఆ ప్రమాదాన్ని చూసి ఆగి *108* కి ఫోన్ చేసి అతనిని దగ్గర ఉండి హాస్పిటల్ కు పంపించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలాగే ప్రతి ఒక్క భారత పౌరుడు సేవా భావంతో ఉండాలని కోరుకుంటున్నాము.





