సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.
240 Views(మానకొండూర్ అక్టోబర్ 06) చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థులు కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని శుక్రవారం మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడాస్ చైర్మన్ జి.వి రామకృష్ణారావు తో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ పృథ్విరాజ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబెర్ […]
125 Viewsగడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చదువు నేర్పిన గురువులు నాగభూషణం శంకరయ్య జనార్ధన్ వెంకటయ్య భాను కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం రోజునపూర్వవిద్యార్తుల సమ్మేళనం 1987 88 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిపారు. మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట వారితో చదివి పలు కారణాలతో మృతి చెందిన 22 మంది సహచర విద్యార్థులకు […]
189 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు -మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారం – *నేడు ( ఫిబ్రవరి 1 వ తేదీన) మంత్రి శ్రీ తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం* తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని […]