(మానకొండూర్ అక్టోబర్ 06)
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థులు కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని శుక్రవారం మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడాస్ చైర్మన్ జి.వి రామకృష్ణారావు తో కలిసి ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ పృథ్విరాజ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబెర్ ఎలుక ఆంజనేయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు…




